హైదరాబాద్ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ( IICT ) డైరెక్టర్గా డాక్టర్ డీ శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్( NGRI ) డైరెక్టర్గా కొనసాగుతున్న డాక్టర్ వీఎం తివారీ.. 2021, డిసెంబర్ నుంచి ఐఐసీటీ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి 2020 నుంచి సీఎస్ఐఆర్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటగ్రేటివ్ మెడిసిన్(జమ్మూ) డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు. 2022, ఫిబ్రవరి నుంచి సీఎస్ఐఆర్ – సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(లక్నో) డైరెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పీజీ పట్టా అందుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నారు. చికాగోలో పోస్టు డాక్టోరల్ వర్క్ పూర్తి చేశారు.