బంజారాహిల్స్,ఏప్రిల్ 27 : విద్యార్థులు వేసవి సెలవులను వృథా చేసుకోకుండా క్రీడలతో పాటు నచ్చిన అంశాల్లో శిక్షణ పొందాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నెం 3లోని యూబీఐ కాలనీ వెల్ఫేర్ అసోయేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం నిర్వహించిన సమ్మర్ క్యాంపులో ప్రతిభ కనబర్చిన వారికి బుధవారం మంత్రి బహుమతులు అందజేశారు.
శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..వేసవి సెలవుల్లో సంగీతం, డ్యాన్స్, క్రాఫ్ట్స్, ఆటలు లేదా తమకు నచ్చిన ఇతర అంశాల్లో శిక్షణ పొందాలని సూచించారు. కార్యక్రమంలో యూబీఐ కాలనీ అధ్యక్షుడు నరేంద్ర చోప్రా,క్యాంపు నిర్వాహకులు యండమూరి గీత తదితరులు పాల్గొన్నారు.