హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : జిల్లా సహకార శాఖ అధికారి అనుమతి లేకుండా ఏ విధమైనా రిజిస్ట్రేషన్లు చేయొద్దని తెలుగు సినీ వరర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థలాలను కమిటీ అన్యాక్రాంతం చేయొద్దని, థర్డ్ పార్టీకి హకులు కల్పించొద్దని చెప్పింది. ఐదుగురు సభ్యుల కమిటీ నిర్ణయాలకు వ్యతిరేకంగా కేటాయింపులు చేస్తున్నారని పేరొంటూ మద్దినేని రమేశ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై జస్టిస్ కే లలిత ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
గత డిసెంబర్ 15న రిజిస్ట్రార్కు లేఖ రాస్తే, పట్టించుకోకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తున్నారని పిటిషనర్ న్యాయవాది చెప్పారు. జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ అనుమతి, ఆమోదం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయొద్దని సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు రాసినట్టు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అనంతరం హైకోర్టు పైవిధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సొసైటీ నిర్వహణకు కమిటీ ఉన్నందున మరో కమిటీ అవసరం లేదని చెప్పి, విచారణను వాయిదా వేసింది.