హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారని, ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారని తెలిపారు. ప్రసవానికి వారం గడువున్న గర్భిణులను ముందుగానే దవాఖానలకు తరలించి, ప్రత్యేక సౌకర్యాలు కల్పించి కుటుంబ పెద్దలా అండగా నిలుస్తున్నారని వెల్లడించారు. వరద ప్రాంతాల్లో వైద్య, విద్యుత్తు, తాగునీటి వసతులకు ఎలాంటి అవాంతరాలు రాకుండా చర్యలు తీసుకొంటున్నారని వివరించారు. ఒక వైపు ప్రభుత్వం, మరోవైపు టీఆర్ఎస్ నాయకులు ఎకడికకడ వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఆహారాన్ని పంపిణీ చేస్తూ ప్రజలకు ధైర్యాన్నిస్తున్నారని పేర్కొన్నారు.