గంభీరావుపేట, ఫిబ్రవరి 2: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కేజీ టు పీజీ విద్యా సంస్థలకు ప్రొఫెసర్ జయశంకర్ పేరును ప్రకటిస్తూ గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం కేజీ టు పీజీ విద్యా సంస్థల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్ వేదికపై నుంచి మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ మాట మేరకు రాష్ట్రంలో మొదటి కేజీ టు పీజీ విద్యా ప్రాంగణం గంభీరావుపేటలో ఏర్పాటు చేసుకొన్నాం. ఈ క్యాంపస్కు తెలంగాణ సిద్ధ్దాంతకర్త జయశంకర్ పేరు పెట్టాలి.. ఆవరణలో విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలి’ అని సూచించారు. ఈ మేరకు పేరును ప్రకటిస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.