హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): వివిధ స్టడీ సర్కిళ్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇస్తున్న ఉచిత శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గిరిజన సంక్షేమ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొంది గ్రూప్-1 మెయిన్కు ఎంపికైన 123 మంది అభ్యర్థులు బుధవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్ సంక్షేమ భవన్లో మంత్రి సత్యవతి రాథోడ్ను కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించి, రూ.5 వేల పారితోషికం, ట్యాబ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్టీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొంది 123 మంది గ్రూప్ 1 మెయిన్కు ఎంపిక కావడం విశేషమని అన్నారు. మెయిన్కు సైతం వసతితోపాటు మెరుగైన కోచింగ్ ఇప్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా, జీఎం సీతారాం నాయక్, జేడీ సముజ్వల, లక్ష్మీప్రసాద్, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
పిగ్ ఫారాల ఏర్పాటుకు రుణాలివ్వాలి
రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల్లో ఒక తెగ అయిన ఎరుకల కులస్థులు లక్ష మందికి పైగా ఉన్నారని, మొదటి నుంచి పందుల పెంపకంతోపాటు బుట్టలు, తట్టలు అల్లు తూ జీవనోపాధి పొందుతున్నారని, ప్రస్తు తం ప్లాస్టిక్ వినియోగం పెరగడంతో వీరి జీవనోపాధి దుర్భరంగా మారిందని ఎరుకల సంఘం నేతలు మంత్రికి వివరించా రు. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పెంపకందారులకు సబ్సిడీపై రుణాలిచ్చినట్టు తమకు ఫారాలు ఏర్పాటు చేసుకొనేందుకు రుణా లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రానున్న రాష్ట్ర బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించేలా చూడాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ఎరుకల సంఘం రాష్ట్ర నేతలు రాములు, రాజు, రవికుమార్, గోపాల్, శ్రీరామ్ ఆనంద్, రాజశేఖర్, నాగులు, శ్రీశైలం, మల్లేశం, సత్యనారాయణ, నర్సింగ్ తదితరులు ఉన్నారు.