Fish prasadam | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మంగళవారం నాం పల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నెల 9న మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే చేప ప్రసాదం పంపిణీకి వివిధశాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేప ప్రసాదం కోసం గతంలో కంటే అధికంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అవసరమైన చేప పిల్లలను మత్స్యశాఖ సరఫరా చేయనున్నట్టు తెలిపారు.