రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీఆర్ఎస్ ఫిర్యాదు
హైదరాబాద్, మార్చి10 (నమస్తే తెలంగాణ): మతం పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని టీఆర్ఎస్ కోరింది. ఈ మేరకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ భరత్కుమార్ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) శశాంక్గోయల్కు ఫిర్యా దు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇతర సోషల్మీడియా ఖాతాల్లో ఓ మతానికి సంబంధించి రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.