హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బుక్ ఫెయిర్ అట్టహాసంగా కొనసాగుతున్నది. వారాంతంతోపాటు క్రిస్మస్ సెలవులు రావడంతో శనివారం పుస్తక ప్రేమికులు, పలు పాఠశాలల విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ప్రతి బుక్స్టాల్ను కలియతిరుగుతూ నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేశారు. సందర్శకుల తాకిడితో బుక్ ఫెయిర్ కళకళలాడింది. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా బుక్ఫెయిర్లో మొక్కలను పంపిణీ చేశారు.
బుక్ ఫెయిర్లో మొకలు అందజేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి శ్రవణ్ తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్కుమార్ చేస్తున్న కృషిని పుస్తక ప్రేమికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ప్రముఖ పర్యావరణవేత్త వేదకుమార్ తదితరులు పాల్గొన్నారు.