ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 15: ప్రజలకు పట్టింపు లేనంతకాలం వ్యవస్థలో ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా లాభం ఏమీ ఉండదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. చట్టాలపై ప్రజలకు అవగాహన ఉన్నా 40 ఏండ్లుగా పార్టీ ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ప్రజలు మారినపుడే సంస్కరణల వల్ల ప్రయోజనం చేకూరుతున్నదని అభిప్రాయపడ్డారు.
బుధవారం ఓయూలో ‘ది స్ట్రగుల్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ ఇన్ ఇం డియా’ పుస్తకంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కులం, మతం, ప్రాంతం తదితర వైషమ్యాలు వదిలి యువత స్పందించినపుడే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. పుస్తక రచయిత, మాజీ డీజీపీ, పద్మశ్రీ ప్రకాశ్సింగ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే పోలీసు సంస్కరణలు అనివార్యమన్నారు. తెలంగాణ టుడే ఎడిటర్ కే శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ప్రకాశ్సింగ్ రాసిన పుస్తకం భవిష్యత్తు తరాలకు ఒక పరిశోధనా గ్రంథంగా ఉపయోగపడుతున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఐపీఎస్ అధికారి కమల్కుమార్, మజీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.