నిర్మల్, మే 27 (నమస్తే తెలంగాణ): నిర్మల్ మున్సిపాలిటీలో గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన పీహెచ్ వర్కర్ల నియామక ప్రక్రియను నిలిపి వేస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్మల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిర్మల్ మున్సిపాలిటీలో అవకతవకలు జరిగాయంటూ గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని కలెక్టర్కు ఆదేశాలిచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. నివేదికను పరిశీలించిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.