హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ఆవిర్భావించనుంది. స్వయం ప్రతిపత్తితో వికలాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం రేపు ఉత్తర్వులు జారీ చేయనుంది. రేపు ప్రపంచ వికలాంగుల దినోత్సవం నేపథ్యంలో ఉత్తర్వులను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి కొప్పుల ఈశ్వర్ ధన్యవాదాలు తెలిపారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి వికలాంగుల శాఖను ప్రభుత్వం విభజించిన సంగతి తెలిసిందే. వికలాంగుల శాఖను డీమెర్జ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.