హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)విచారణ ప్రారంభించింది. మొదటిరోజు మంగళవారం దర్శకుడు పూరీ జగన్నాథ్ తన కుమారుడు ఆకాశ్ పూరి, చార్టెడ్ అకౌంటెంట్తో కలిసి విచారణకు హాజరయ్యారు. దాదాపు 10 గంటలపాటు అధికారులు పూరీని విచారించారు. స్టేట్మెంట పై సంతకాలు తీసుకొని, ఎప్పుడు పిలిచినా రావాలని ఆదేశించా రు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై పూరీని ప్ర శ్నించారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలపై ఆరా తీశా రు.ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయన్న అంశాలపై వివరాలు సేకరించిన అధికారులు జగన్నాథ్కు సంబంధించిన మూడు బ్యాంకు అకౌంట్లను, ఆడిట్ రిపోర్టులను పరిశీలించారు. డ్రగ్స్ కేసులో ప్ర ధాన నిందితుడు కెల్విన్ సహా మరో 12 మంది డ్రగ్పెడ్లర్ల బ్యాంక్ లావాదేవీలను పరిశీలించారు. టెక్నికల్ టీమ్తో ఫొరెన్సిక్ అడిట్ వివరాలు సేకరించారు. 2015 నుంచి 2017 మధ్య కాలంలో జరిగిన నగదు లావాదేవీలపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.
అమ్మతోడు నాకు సంబంధంలేదు: బండ్ల గణేశ్
పూరీ విచారణ జరుగుతుండగానే సాయంత్రం 6.45 గంటల సమయంలో నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఈడీ ఆఫీస్కు వచ్చా రు. గణేష్ నిర్మాతగా పూరీ డైరెక్షన్లో నాలుగైదు సినిమాలొచ్చా యి. వీటిని విదేశాల్లో చిత్రీకరిస్తున్న సమయంలోనే మనీల్యాండరింగ్ జరిగినట్టు భావిస్తున్నారు. దీనిపైనే బండ్ల గణేశ్ను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆయన ధ్రువీకరించలేదు. పూరీ జగన్నాథ్ను ఊరికే కలవడానికే వచ్చానని, అంతకుమించి అమ్మతోడు ఈ కేసుకు తనకు సంబంధం లేదని మీడియాతో బండ్ల గణేష్ చెప్పారు. 2017లో నమోదైన ఈ కేసు ఆధారంగా ఈడీ చేపట్టిన సినీ ప్రముఖుల విచారణ సెప్టెంబరు 22వ తేదీ వరకు కొనసాగనున్నది. 12 మంది సినీ ప్రముఖులను విచారించనున్నారు. సెప్టెంబరు 2న చార్మి కౌర్, 6న రకుల్ప్రీత్ సింగ్, 8న రాణా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనిష్, 20న నందు, 22న తరుణ్ విచారణకు హాజరుకానున్నారు.