హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : దుబాయ్లోని వరల్డ్ లీడర్ సమ్మిట్కు హైదరాబాద్కు చెందిన విద్యావేత్త హాజరయ్యారు. నలంద విద్యాసంస్థ వెంగల్రావునగర్ డైరెక్టర్ సూర్య మంతెన భారతీయ ప్రతినిధిగా ఈ సమ్మిట్లో పాల్గొన్నారు.
ఎస్పీ జైన్ దుబాయ్ క్యాంపస్ సహకారంతో ఇటీవలే నిర్వహించిన ఈ సమ్మిట్లో అనేక విద్యాసంబంధ అంశాలపై, సాంకేతిక పరిజ్ఞానంపై చర్చలు జరిగాయి.