ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 7: మూడు నెలలుగా వేతనాలు లేక అల్లాడుతున్నామని ఖమ్మం జిల్లా ప్రధాన దవాఖానలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం వారు వివిధ కార్మిక సంఘాలతో కలిసి దవాఖాన ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాల విషయమై ప్రశ్నిస్తే అటు కాంట్రాక్టర్, ఇటు అధికారులు తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సుమారు రెండు గంటలపాటు ధర్నా చేపట్టడంతో రోగులతోపాటు వైద్యులు, వైద్యసిబ్బందికి ఆటంకం కలిగింది. రెండు వారాల్లోగా వేతనాలు ఇప్పిస్తామని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్కుమార్, ఆర్ఎంవో అమర్సింగ్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.