హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి(Dharmapuri) లక్ష్మీనరసింహస్వామి (Lakshminarasimha swamy) ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు(Brahmotsavalu) ప్రారంభం కానున్నాయి. బుధవారం సాయంత్రం కలశస్థాపన, వరాహ తీర్థం, పుట్ట బంగారం కార్యక్రమం నిర్వహిస్తారు. గురువారం సాయంత్రం ధర్మపురి ఆలయంలో స్వామి వారి కల్యాణం, ఈ నెల 28ప ధర్మపురిలో రథోత్సవం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.