కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 27: ధరణి ఆపరేటర్ ఓ రైతు నుంచి లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్పేటకు చెందిన రాపెల్లి సంతోష్కు 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. దానిపై మార్టిగేజ్ రుణం కోసం బ్యాంకు పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు మీ సేవా కేంద్రంలో స్లాట్ బుక్ చేశారు.
అనంతరం రిజిస్ట్రేషన్ కోసం తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లగా ధరణి ఆపరేటర్ పోలు కుమారస్వామి రూ.10 వేలు లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.7,500కు అంగీకరించాడు. డబ్బులు ఇతరుల ద్వారా ఇప్పించాలని షరతు పెట్టాడు. దీంతో రైతు సంతోష్ తన స్నేహితుడు యాదగిరి శ్రీనివాస్ ద్వారా శనివారం డబ్బులు పంపగా తాసిల్దార్ కార్యాలయంలోనే కుమారస్వామి రూ.7,500 లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు.