హైదరాబాద్ : మణిపూర్ రాష్ట్రంలో తలెత్తిన శాంతి భద్రతల పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని తెలంగాణ వాసులను సురక్షితంగా హైదరాబాద్ కు తరలించడంలో కృషి చేసిన పోలీస్ అధికారులను డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjani Kumar)మంగళవారం అభినందించారు. డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ అధికారులు అడిషనల్ డీజీ లు మహేష్ భగవత్, అభిలాష బిస్ట్, డీఐజీ బి. సుమతి తోపాటు, కంట్రోల్ రూంలో విధులునిర్వహించిన జయరాం, నగేష్ బాబు, తిరుపతి, సుదర్శన్ తదితర పోలీస్ అధికారులను సన్మానించారు(Honors).
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మణిపూర్(Manipur) నుంచి తెలంగాణ వాసులను తరలించడం లాంటి అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ అధికారులు అత్యుత్తమ సేవలందించారని ప్రశంసించారు. పర్వత ప్రాంతమైన మణిపూర్ లో సరైన కమ్యూనికేషన్ సౌకర్యాలు లేనప్పటికీ అక్కడి పోలీస్, మిలటరీ ( Police and Milatary )అధికారులతో ఎప్పటికప్పుడూ సంప్రదించడం, వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పనిచేయడం అభినందనీయమని అన్నారు.
పోలీసులకు ఇటువంటి ఘటనలు సరికొత్త పాఠాలుగా ఉంటాయని పేర్కొన్నారు. అడిషనల్ డీజీ మహేష్ భగవత్ మాట్లాడుతూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇతర శాఖల అధికారులతో ఎప్పటికప్పుడూ మాట్లాడి 112 మందిని సురక్షితంగా తెలంగాణకు చేర్చగలిగామని పేర్కొన్నారు.