తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 16: ప్రముఖ పాత్రికేయుడు ఆర్ దిలీప్రెడ్డిని 2023 సంవత్సరానికిగాను డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారానికి ఎంపిక చేసినట్టు తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి బుధవారం ప్రకటించారు. మెదక్ జిల్లాకు చెందిన దిలీప్రెడ్డి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వివిధ హోదా ల్లో పనిచేశారు. సమాచార హక్కు చట్టం కమిషనర్గా, పర్యావరణవేత్తగా సేవలు అందించారు. ఆయన సేవలకుగాను పురస్కారానికి ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. 25న జరిగే కార్యక్రమంలో దిలీప్రెడ్డికి పురస్కారం కింద రూ.25 వేల నగదు, జ్ఞాపిక, శాలువాతో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి చేతులమీదుగా సత్కరిస్తామని ప్రధా న కార్యదర్శి డాక్టర్ జే చెన్నయ్య వెల్లడించారు.