యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీలక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 7వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం జగన్మోహిని అలంకార సేవలో భక్తులకు(Devotees) నారసింహుడు దర్శనమిచ్చారు. రాత్రి అశ్వవాహన సేవ, ఎదుర్కోల్లు మహోత్సవం ఆలయ అధికారులు నిర్వహించనున్నారు.
కాగా, ఆదివారం సెలవు దినం కావడంతో యాదగిరిగుట్ట నరసన్న దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట సమయం పడుతున్నది. కాగా, ఆలయ మహా ఉద్ఘాటన తర్వాత రెండోసారి బ్రహోత్సవాలు జరుగుతుండగా, ఈ నెల 21 వేడుకలు కొనసాగనున్నాయి.