హైదరాబాద్: ప్రముఖ ప్రీమియం జ్యుయెలరీ బ్రాండ్ అయిన ‘దేవీ పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ ఎక్స్క్లూజివ్ జ్యుయెలరీ’ తన కొత్త స్టోర్ను హైదరాబాద్ కూకట్పల్లిలోని PNR ఎంపైర్లో ప్రారంభించింది. అందాల సినీ తార కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ఈ కొత్త స్టోర్ను ప్రారంభమైంది. ఈ జ్యుయెలరీ స్టోర్ ప్రత్యేకమైన షాపింగ్ అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో డైమండ్ నెక్లెస్లు, బ్రాస్లెట్లు, చెవి పోగులు, ఉంగరాలు సహా మహిళలు, పురుషుల కోసం బంగారు, వజ్రాభరణాలు లభిస్తాయి. ఈ స్టోర్ను ఆధునిక హంగులతో కస్టమర్లకు సౌకర్యవంతంగా ఉండేలా తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యుయెలరీ’తో అనుబంధం ఏర్పడటం, హైదరాబాద్లో వారి అతిపెద్ద స్టోర్ను ప్రారంభించడం నాకు గొప్ప గౌరవం. దేవి పవిత్రలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే.. ఈ స్టోర్లో సంప్రదాయ ఆభరణాల నుంచి ఆధునిక డిజైన్ల వరకు అన్ని అందుబాటులో ఉన్నాయి’ అని చెప్పింది.
దేవీ పవిత్ర గోల్డ్ & డైమండ్స్ డైరెక్టర్స్ మాట్లాడుతూ.. దేవి పవిత్ర గోల్డ్ & డైమండ్స్ జ్యుయెలరీలోని ఆభరణాలు అత్యంత నాణ్యమైన మెటీరియల్తో తయారు చేయబడ్డాయని చెప్పారు. ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన డిజైన్లను రూపొందించడంలో నైపుణ్యం కలిగిన కళాకారులు వీటిని తయారు చేశారు. ఈ స్టోర్ కస్టమ్ జ్యుయెలరీ డిజైన్ సేవలను కూడా అందిస్తుంది.