కాశీబుగ్గ, ఫిబ్రవరి 26: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం దేశీ రకం మిర్చి ధర క్వింటాల్కు రూ.42 వేలు పలికింది. గరిష్ఠంగా క్వింటాల్కు రూ.42 వేలు, మధ్యరకం రూ.38 వేలు, కనిష్ఠంగా రూ.33 వేలు పలికింది. డిసెంబర్ నుంచి మిర్చి సీజన్ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 3,48,360 క్వింటాళ్ల మిర్చి మార్కెట్కు వచ్చింది. అందులో దేశీరకం మిర్చి 2,647 క్వింటాళ్లని మార్కెట్ వర్గాలు తెలిపాయి.