ముఖ్యమంత్రి కేసీఆర్కు యాదవ కులస్తులు జై కొట్టారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని దేశరాజ్పల్లి గ్రామంలో యాదవ కులస్తులు సమావేశమై.. టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మాన ప్రతిని ఓయూ జేఏసీ నేత రాజారాంయాదవ్కు అందజేశారు. ఈ సందర్భంగా రాజారాంయాదవ్ మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యమకారులు, విద్యార్థి నాయకులకు సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యాదవ సంఘం టీఆర్ఎస్కు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కన్నెబోయిన శ్రీనివాస్, యాదవ సంఘం మండల అధ్యక్షుడు ఎల్లబోయిన రాజయ్యయాదవ్, రాజ్కుమార్, భిక్షపతి, కోటి, రోషన్, సరిత, యశోద తదితరులున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబాల గౌడ కులస్థులు టీఆర్ఎస్కే మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.