హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎస్సీ 57 ఉపకులాలను ‘ఏ’ వర్గంలో చేర్చి వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎస్సీ ఉపకులాల హకుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశం తెలిపారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ ఉపకులాల వారు దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణే దీనికి పరిష్కారమని చెప్పారు. ఎస్సీ ఉపకులాలకు న్యాయమైన వాటా దకాలంటే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ఉపకులాల స్థితిగతులపై సమగ్ర విచారణ జరుపాలని కోరారు.