హైదరాబాద్, ఆగస్టు21 (నమస్తే తెలంగాణ): బీబీనగర్లోని ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో ఈ నెల 23 నుంచి 26 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. గురుకులాల సెక్రటరీ నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కాలేజీల్లో బీఎస్సీ ఎంపీసీ, ఎంఎస్సీఎస్, బీజడ్సీ, ఎంజడ్సీ, బీకాం కంప్యూటర్స్, బీఏ హెచ్ఈపీ కోర్సుల్లో మొత్తంగా 30 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వివరాలకు 9493964798, 7995010687ను సంప్రదించాలని సూచించారు.