మహదేవపూర్, జూన్ 30 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్లో నీటి మట్టం తగ్గుతోంది. బరాజ్కు ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం తగ్గడంతో నీటిమట్టం తగ్గింది. పూర్తి నిల్వ నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.2 టీఎంసీల నీరు ఉంది.
బుధవారం ఇన్ఫ్లో 8,900 క్యూసెక్కులు ఉండగా ప్రస్తుతం గురువారం7,500 క్యూసెక్కులకు తగ్గింది. అవుట్ఫ్లో 14,520 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం బరాజ్ 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్లు ఇంజినీరింగ్ శాఖ అధికారులు పేర్కొన్నారు.