హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఎన్టీపీసీ సదరన్ రీజియన్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్ఈడీ)గా దేబాశిష్ ఛటోపాధ్యాయ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎన్టీపీసీ సదరన్ రీజియన్కు చెందిన పలువు రు అధికారులు ఆయనకు స్వాగ తం పలికారు. ఛటోపాధ్యాయ గతంలో ఢిల్లీలో ఎన్టీపీసీ హెడ్క్వార్టర్స్ సీఈవోగా పనిచేశారు. ఆయనకు విద్యుత్తురంగంలో 36 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నది. ఎన్టీపీసీలో వివిధ హోదాల్లో పనిచేశారు.