మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి 7: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్పల్లి గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు వంగపల్లి రాజమ్మ (83) మరణించారు. రాజమ్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సిద్దిపేటలోని సర్కార్ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. బైరాన్పల్లిలో రజాకార్లకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధపోరాటంలో రాజమ్మ ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు గ్రామస్థులు గుర్తుచేశారు. రాజమ్మకు కుమారుడు, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. రాజమ్మ మృతికి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఫోన్లో కుటుంబ సభ్యులను పరామర్శించారు.