శంకరపట్నం, సెప్టెంబర్ 3: గుండెపోటుతో తండ్రి మరణించడంతో కూతురి వివాహం ఆగిపోయింది. ఈ విషాదకర ఘటన ఆదివా రం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్పూర్లో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన ఎర్రల రాములు(48) ట్రాక్టర్ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అతడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురి వివాహం ఆదివారం ఉదయం 10గంటలకు కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి గుట్టపై జరగాల్సి ఉన్నది. మరో రెండు గంటల్లో వివాహతంతు మొదలు కావాల్సి ఉండగా రాములు ఛాతిలో నొప్పిరావడంతో కుప్పకూలాడు. గమనించిన బంధువులు హూటాహుటిన హుజూరాబాద్ ప్రభుత్వ దవఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. రాములు మృతితో భార్యాబిడ్డలు, బంధువులు కన్నీర