నవీపేట/రెంజల్, మే 24: భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కూతురిను చూసేందుకు వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నిమిషాల వ్యవధిలోనే ఇద్దరూ మృతి చెందడంతో వీరన్నగుట్ట లో విషాదం నెలకొన్నది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన రాథోడ్ లక్ష్మణ్ (52) తన కూతురు జ్యోతి (36)కి నవీపేట్ మండలం అబ్బాపూర్ తం డాకు చెందిన మాలోత్ ప్రకాశ్తో వివాహ మైంది.
నాలుగేండ్ల క్రితం మరో పెండ్లి చేసుకున్న ప్రకాశ్ మొదటి భార్య జ్యోతిని 5 లక్షల అదనపు కట్నం, ఎకరం భూమి తేవాలని వేధించిసాగాడు. వేధింపులు భరించలేక జ్యోతి ఈ నెల 22న పురుగు మందు తాగింది. ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కూతురిని చూసేందుకు గురువారం దవాఖానకు వచ్చిన తండ్రి లక్ష్మణ్ తిరిగి బైక్పై వెళ్తుండగా, ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి దవాఖానలో చేరాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న జ్యోతి చనిపోగా, అరగంట వ్యవధిలో తండ్రి కూడా ప్రాణాలు వదిలాడు.