న్యూఢిల్లీ, నవంబర్ 8: గతేడాది 11,716 మంది వ్యాపారస్తులు ఆత్మహత్యకు పాల్పడినట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. అదే ఏడాది బలవన్మరణానికి పాల్పడిన 10,677 మంది రైతులతో పోలిస్తే ఇది ఎక్కువని తెలిపింది. ఆత్మహత్యకు పాల్పడిన వారిలో 4,356 మంది వ్యాపారస్తులు కాగా, 4,226 మంది విక్రయదారులు. మిగిలిన వారు ఇతర చిన్న కంపెనీలను నడుపుతున్నవారు. 2019లో 2,906 మంది విక్రయదారులు ఆత్మహత్యకు పాల్పడగా, 2020లో ఇది దాదాపు 50 శాతం పెరిగి 4,356కు చేరుకున్నట్టు ఎన్సీఆర్మీ తెలిపింది.
ఎందుకు ఇలా?
సాధారణంగా రైతుల ఆత్మహత్యలతో పోలిస్తే వ్యాపారస్తుల సూసైడ్ రేటు తక్కువగానే ఉంటుందని, అయితే కరోనా లాక్డౌన్ నిబంధనలతో వ్యాపార రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎంటర్ప్రైజెస్’ ప్రధాన కార్యదర్శి అనిల్ పేర్కొన్నారు. చేసిన అప్పులు తీర్చలేక చాలామంది వ్యాపారస్తులు, విక్రేతలు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు.