హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహించిన దసరా షాపింగ్ బొనాంజా బంపర్ ప్రైజ్ నిస్సాన్ మాగ్నెట్ కారును సోమవారం విజేత పీఎస్ఎన్ మూర్తి దంపతులు అందుకున్నారు.
హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని ప్రధాన కార్యాలయంలో నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ టుడే ఎడిటర్ కే శ్రీనివాస్రెడ్డి, తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ డీ చిరంజీవి, జనరల్ మేనేజర్ (ఏడీవీటీ) ఎన్ సురేందర్రావు కారు తాళాలను విజేత దంపతులకు అందజేశారు.