దవాఖానకు పోతే మందు గోలీలిస్తరు. కొంతమందికి సూది మందిస్తరు. కానీ, కామారెడ్డి జిల్లాకేంద్రంలోని ఏరియా దవాఖానలో పేషెంట్ల ముందు నర్సులు డ్యాన్సులు చేస్తున్నారు. కరోనా రోగులతో యోగాసనాలు, డ్యాన్సులు చేయిస్తున్నారు. వైరస్ కంటే భయంతోనే ఎక్కువమంది చనిపోతున్న నేపథ్యంలో.. దవాఖానకు వస్తున్న బాధితుల్లో కొండంత మనోధైర్యం నింపుతున్నారు. రోగులు హుషారుగా ఉండేలా ఉత్సాహపరుస్తున్నారు. దవాఖానలో బుధవారం తీసిన ఓ వీడియో గురువారం సోషల్మీడియాలో వైరల్ అయింది. నర్సులను పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.