తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేసిన ఎంపీలు..
ఉపరాష్ట్రపతి వెంకయ్య సహా పలువురి శుభాకాంక్షలు
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఏకగ్రీవంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు శుక్రవారం రాజ్యసభలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ పబ్లికేషన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావు, హెటిరో ఫార్మసీ వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డితో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. ఇద్దరు ఎంపీలు తెలుగులో దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అంతకుముందు పార్లమెంట్ ప్రాంగణంలో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించి, జై తెలంగాణ నినాదాలు చేశారు. ఏపీ కోటా నుంచి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ప్రముఖ న్యాయ వాది నిరంజన్రెడ్డి కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు.
అనంతరం వీరందరితో ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా సమావేశమై అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, రా జ్యసభలో టీఆర్ఎస్ ఉప నేత కేఆర్ సురేశ్రెడ్డి, ఎంపీ లు వద్దిరాజు రవిచంద్ర, వెంకటేశ్ నేత తదితరులు నూతన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంపీలు దీవకొండ దామోదర్రావు, బండి పార్థసారథిరెడ్డి కుటుంబసభ్యులతో హాజరయ్యా రు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఫొటోలు దిగారు.