యాదాద్రి భువనగిరి, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం గిరిజన తండాలు, దళిత వాడల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రతి తండా, దళిత వాడను ఆదర్శంగా తీర్చిదిద్దేందు సంకల్పించింది. ఇందులో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలోని 2,634 దళిత వాడలు, 731 గిరిజన తండాల్లో సర్వే నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకుగాను రూ.155కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్ప టికే ప్రభుత్వానికి సంబంధిత నివేదిక అందగా.. నిధుల కేటాయింపులు జరిపిన వెంటనే పనులను చేపట్టేందుకు జిల్లాయంత్రాంగం సన్నద్దమవుతోంది.
జిల్లాలో మండలాలు : 17
మొత్తం గ్రామపంచాయతీలు :421
దళిత వాడలు : 2,634
గిరిజన తండాలు : 731
ప్రభుత్వం పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలతో గ్రామ పంచాయతీల అభివృద్ధికి విరివిగా నిధులు కేటాయించి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నది. అయితే ఆయా పంచాయతీల పరిధిలోని గిరిజన తండాలు, దళిత వాడల్లో ఇంకా కొన్ని సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. సీసీ రోడ్లు, మురుగు కాల్వలు వంటి సదుపాయాలు ఇంకా అవసరం కావడంతో ఆయా మౌలిక వసతులను కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం ఇప్పటికే వివిధ శాఖల ఆధ్వ ర్యంలో సర్వే నిర్వహించి చేపట్టాల్సిన పనులను గుర్తించింది. త్వరలోనే ఇందుకు సంబంధించి నిధులు విడుదల కానుండడంతో తండాలు, దళిత వాడల్లో సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కానున్నాయి.
ప్రభుత్వానికి సర్వే నివేదిక
జిల్లాలోని 17 మండలాల్లోని 421 గ్రామ పంచాయతీల పరిధిలో 2,634 దళిత వాడలు, 731 గిరిజన తండాలు ఉన్నా యి. ఆయా తండాలు, దళిత వాడల్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై అన్ని పంచాయతీలలో అధికారులు సర్వే చేశారు. ప్రతి కాలనీ, ఇంటినీ పరిశీలించి అవసరమైన వివరాలు సేకరించారు. ఇందులో ప్రధానంగా సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు తదితర అంశాలపై ఆరా తీశారు.
గ్రామ, మండల స్థాయి అధికారులతో పాటు ఎంపీ డీవోలు ఈ సర్వేలో భాగస్వామ్యులయ్యారు. ఏయే మౌలిక అవసరాలు ఉన్నాయి? వాటి అమలుకు ఎంత ఖర్చు అవు తుందనే అంచనాలతో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తే తండాలు, దళిత కాలనీలకు మహర్దశ పట్టనుంది.
మౌలిక సదుపాయల కల్పన ఇలా.:
నిర్మించాల్సిన సీసీ రోడ్లు : 2,93,294.05 మీటర్లు
అంచనా వ్యయం : రూ.92.99కోట్లు
నిర్మించాల్సిన మురుగు కాల్వలు : 2,91,353.73 మీటర్లు
అంచనా వ్యయం : రూ.59.84కోట్లు
ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ స్తంభాలు : 6,843
అంచనా వ్యయం : రూ.2.18కోట్లు
ప్రతిపాదనలు ఇలా..
జిల్లాలోని 421 గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న గిరిజన తండాలు, దళిత కాలనీల్లో 2,93,294.05 మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.92.99కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించారు. అలాగే 2,91,353.73 మీటర్ల మురుగు కాల్వల నిర్మాణాలకు రూ.59.84కోట్లు అవసరం అవుతాయని నిర్ధారించారు. విరిగిన, శిథిలావస్థకు చేరిన 4,461 విద్యుత్ స్తంభాలను మార్చడంతోపాటు, కొత్తగా 2,568 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసేందుకు రూ.2.18 కోట్లు అవుతుందని ఎస్టిమేషన్లు రూపొందించారు. మొత్తంగా రూ.155 కోట్లు వ్యయం అవుతుందని ప్రతిపాదనలు రూ పొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వం నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పనులు మొదలుపెట్టేందుకు ఆయా శాఖల అధికారులు సన్నద్దమవుతున్నారు.
సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించాం : సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పంచాయతీల పరిధిలో ఉన్న గిరిజన తండాలు, దళితవాడల్లో సర్వే నిర్వహించడం జరిగింది. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకై అంచనాలతో కూడిన ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాం. నిధుల కేటాయింపుపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.