మహబూబాబాద్: మహబూబాద్ (Mahabubabad) జిల్లా కొత్తగూడలో దారుణం చోటుచేసుకున్నది. చోరీ చేశాడనే అనుమానంతో దళిత యువకుడిని కర్రలతో కొట్టి కారం చల్లారు. కొత్తగూడ మండలం జంగవానిగూడానికి చెందిన వంకాయల కార్తీక్.. అదే పొగుళ్లపల్లికి చెందిన గద్ద అశోక్ అనే వ్యక్తి వద్ద టెంట్ హౌస్లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సౌండ్ బాక్స్లో ఉపయోగించే యాంప్లిఫయర్ చోరీకి గురైందని, దానిని ఖానాపూర్లో విక్రయించారని అశోక్ గుర్తించారు. దీంతో కొందరు వ్యక్తులతోకలిసి కార్తీక్ ఇంటికి వెళ్లారు. పని ఉందని చెప్పి తన కారులో పొగుళ్లపల్లికి తీసుకొచ్చారు.
కార్తీక్ను అతని అంగితో గ్రామ పంచాయతీ కిటికీకి కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన పట్టించుకోని వారు.. అతనికి రక్తం కారుతుండగా ఆ గాయాలపై కారం చల్లుతూ చిత్రహింసలకు పాల్పడ్డారు. స్పృహ కోల్పోయిన కార్తీక్ను మళ్లీ అతని ఇంటి వద్ద వదిలేశారు. ఈ ఘటననంతా తమ సెల్ఫోన్లలో బంధించారు. కాగా, అశోక్ ఫిర్యాదు మేరకు కార్తీక్పై చోరీ కేసు, కార్తీక్పై దాడి చేసిన ఘటనలో అశోక్తోపాటు అతనికి సహాయం చేసినవారిపై పోలీసులు కేసు నమోదుచేశారు.
చోరీ చేశాడు అనే అనుమానంతో దళిత యువకుడిని కర్రలతో కొట్టి కారం చల్లారు
మహబూబాబాద్ – కొత్తగూడ మండలం జంగవానిగూడెం(రాంపూర్) గ్రామానికి చెందిన యువకుడు వంకాయల కార్తీక్ను అదే మండలం పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన టెంట్ హౌస్ యజమాని గద్ద అశోక్ పనికి పెట్టుకున్నాడు.
ఈ క్రమంలో డీజే(సౌండ్… pic.twitter.com/2ZvdnhxRhb
— Telugu Scribe (@TeluguScribe) March 31, 2024