ముంబై, జూలై 10: కరెంటు బిల్లులు చెల్లించాలని, లేకపోతే విద్యుత్తు కనెక్షన్ కట్ చేస్తామని చెబుతూ.. సైబర్చోరులు కొత్త తరహా నేరాలకు పాల్పడుతున్నారు. మహారాష్ట్రలోని ముంబైలో ఇలా 80మంది నుంచి కోటి రూపాయల వరకు కాజేశారు. బాధితుల్లో వైద్యులు, నేవీ అధికారులు, విద్యార్థులు, హోటల్ యజమానులూ ఉండటం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో ఇలా ఫేక్ కరెంటు బిల్లుల వ్యవహారంలో ఇంకా ఎంతమంది బాధితులున్నారనేది తెలియాల్సి ఉన్నది.
ఈ నెల కరెంటు బిల్లు ఇంకా చెల్లించలేదంటూ సైబర్ క్రిమినల్స్ ముంబై వాసుల ఫోన్లకు మెసేజ్లు పంపారు. ఈ నెల కరెంటు బిల్లు చెల్లించలేదని, వెంటనే విద్యుత్తుశాఖ అధికారికి ఫోన్ చేయకపోతే రాత్రికల్లా కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని పేర్కొంటూ తమ కాల్సెంటర్ ఫోన్నెంబర్ను ఆ మెసేజ్లలో పొందుపర్చారు. బిల్లు కట్టినప్పటికీ మెసేజ్ రావడంతో ఆందోళనకు గురైన చాలామంది కాల్సెంటర్కు ఫోన్చేయగా, ఆన్లైన్లో డబ్బులు చెల్లించవచ్చని పేర్కొంటూ.. వారి డిటైల్స్ అన్నీ లాగేశారు. వాటిద్వారా బ్యాంకు ఖాతాలనుంచి కోటీ 6లక్షల రూపాయల వరకు కొల్లగొట్టారు.