హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరాలు తమకు సవాల్గా మారాయని, రోజువారీ కేసుల్లో 50 శాతం వరకు అవే ఉన్నాయని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలకు అవగాహనతోనే అడ్డుకట్ట వేయగలుగుతామని అన్నారు. జూబ్లీహిల్స్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ)లో ‘సైబర్ నేరాలు, సైబర్ చట్టాలపై అవగాహన’ అంశంపై జూనియర్ సివిల్ జడ్జీలకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ ముగింపులో డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాల విచారణలో సవాళ్లను అధిగమించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని చెప్పారు.
నోడల్ ఏజెన్సీగా తెలంగాణ సీఐడీ
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మహిళలు, పిల్లలపై సైబర్ నేరాల నివారణ (సీసీపీడబ్ల్యూసీ) పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి తెలంగాణ సీఐడీ నోడల్ ఏజెన్సీగా వ్యహరిస్తున్నది. ఎంహెచ్ఏ మార్గదర్శకాల ప్రకారం ఎంసీహెచ్ఆర్డీ సహకారంతో ఇప్పటి వరకు సీఐడీ 4 బ్యాచ్లలో 100 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, 12 మంది అదనపు సెషన్స్ జడ్జీల కోసం సైబర్ నేరాలు, సైబర్ చట్టాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. 30 మంది జూనియర్ సివిల్ జడ్జీలు శిక్షణ పూర్తి చేసుకున్నారు.