హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తె లంగాణ): దేశ వ్యాప్తంగా గల సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ -యూజీ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. మార్చి 30తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా, తాజాగా దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల సవరణకు అవకాశం కల్పించారు. విద్యార్థులు 3లోగా ఎడిటింగ్ చేసుకోవచ్చని ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి.