హైదరాబాద్ : కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు రాష్ర్ట వ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ ఇస్తున్న విషయం విదితమే. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్లర్లు, సిబ్బందికి టీకా ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఎంజీబీఎస్తో పాటు పలు జిల్లా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంజీబీఎస్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పరిశీలించారు. ఇవాళ 16 వేల మందికి వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ వ్యాక్సిన్ను తీసుకోవాలని సునీల్ శర్మ సూచించారు.