హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. సెక్రటేరియట్లో జరుగుతున్న ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, కరోనా మూడో దశ సన్నద్ధతపై చర్చిస్తున్నారు. అదేవిధంగా కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ప్రక్రియపైనా అధికారులతో సమీక్షిస్తున్నారు.