హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రెవెన్యూశాఖ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ను ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి కోరారు. ట్రెసా బృందం మంగళవారం సోమేశ్కుమార్ను కలిసింది. ఈ సందర్భంగా జనాభా ప్రాతిపదికన కొత్త ఆఫీస్ పాటర్న్ను రూపొందించాలని.. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు అనుగుణంగా క్యాడర్ స్ట్రెంత్ పెంచాలని కోరారు. పదోన్నతులు, ఖాళీల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని సీఎస్కు సమర్పించారు. తమ విజ్ఞప్తులపై సీఎస్ సానుకూలంగా స్పందించారని, అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెసా ఉపాధ్యక్షులు నిరంజన్రావ్, బాణాల రాంరెడ్డి, షఫీయుద్దిన్, వీఆర్ఏ జేఏసీ నాయకులు రాజయ్య, దాదేమియా, రమేశ్ బహదూర్, వెంకటేశ్యాదవ్, మాధవనాయుడు తదితరులు పాల్గొన్నారు.