ములుగు : జిల్లాలోని వెంకటాపురంలో కాల్పులు కలకలం సృష్టించాయి. సీఆర్పీఎఫ్ 39వ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో ఎస్ఐ మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం 8:30 గంటలకు చోటు చేసుకుంది. భోజనం తయారీ విషయంలో హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్కు, ఎస్ఐ ఉమేశ్ చంద్ర మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన హెడ్ కానిస్టేబుల్.. ఎస్ఐపై కాల్పులు జరిపాడు. అనంతరం కానిస్టేబుల్ తనకు తాను తుపాకీతో కాల్చుకున్నాడు. అయితే ఉమేశ్ చంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్టీఫెన్ తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ ఉమేశ్ చంద్ర స్వస్థలం బీహార్ కాగా, హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ది తమిళనాడులోని కన్యాకుమారి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.