చేర్యాల : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో బుధవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ చరిత్రలో ఎన్నడు లేని విధంగా 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి.
కార్తీమ మాసం చివరి బుధవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనాలు చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవం మొక్కులు చెల్లించుకున్నారు.