కొండాపూర్, డిసెంబర్ 14 : హెచ్సీయూలోని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుండి ప్రొఫెసర్ విజయ్ బీ మారిశెట్టి, డాక్టర్ వర్ష మామిడి చేసే పరిశోధనకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ రూ.కోటి నిధులను మంజూరు చేసింది.
వ్యవసాయ రంగం అభివృద్ధికి చేసే పరిశోధనకు ఈ నిధులను ఉపయోగిస్తారు. పరిశోధనకు ఈ నిధులివ్వడం పట్ల వర్సిటీ వీసీ బీజే రావు హర్షం వ్యక్తం చేశారు.