హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంకరపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు( Labours ) మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని మహాలింగాపురంలో ఎన్సీసీ సిమెంట్( NCC Cement ) బ్రిక్స్ కంపెనీలో సోమవారం సాయంత్రం పనిచేస్తుండగా భారీ క్రేన్ (Crane Collapses) ఒక్కసారిగా ప్రమాదవశాత్తు కుప్పకూలింది.

ఆ సమయంలో 10 మందికి పైగా కార్మికులు పనిచేస్తుండగా వారిపై క్రేన్ పడడంతో ముగ్గురు మృతి చెందారు. పది మందికి తీవ్రగాయలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను శంకరపల్లి ఆసుపత్రికి హుటాహుటినా తరలించారు.