హైదరాబాద్, ఆగస్టు 15 (నమ స్తే తెలంగాణ): సామాజిక సమాన త్వం కోసం జాతీయోద్యమ స్ఫూర్తి తో మరో సంపూర్ణ స్వాతంత్య్ర పోరాటం అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్లో సోమవారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ తప్పిదాల నుంచే మతోన్మాద బీజేపీకి అవకాశాలు వచ్చాయని చెప్పారు. ఆ పార్టీ రాజకీయ స్వాతంత్య్రాన్ని కాలదన్ని దేశాన్ని నియంతృత్వ, మతోన్మాద రాజ్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో సీపీ ఎం కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.