హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్రెడ్డి భారీ మెజారిటీతో గెలువబోతున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు ఆదివారం అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని, బీజేపీ కుట్రలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్కు పోటీ మేమే అని చెప్పేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను సీపీఎం ఖండిస్తుందని, బీజేపీ ప్రభుత్వాలను కూలస్తోందని, మునుగోడులో గెలిస్తే రాష్ట్రంలో పాగా వేస్తామమని చెప్పి అమిషా చెప్పారని గుర్తు చేశారు. స్వామీజీలు చెప్పిన నెంబర్-2 అమిత్ షానే కదా? అని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ పార్టీ కూలదోస్తామని స్వామిజీలు చెబుతున్నారన్నారు. బీజేపీ నేతలు భాష, అడ్డూ అదుపు లేకుండా ఉందన్నారు. రాజగోపాల్ రెడ్డి మూడేళ్ల నుంచి బీజేపీతో అక్రమ సంబంధం నెరిపాడని విమర్శించారు. కమ్యూనిస్టులను రెచ్చగోటి పోటి చేయడం ద్వారా గెలుపొందాలని చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఓ ప్రమాదం ముందుకు వచ్చిందని, రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ అదిపెద్ద సమస్య అన్నారు. టీఆర్ఎస్కే తాము మద్దతు ఇస్తున్నామ్ని, మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం సీపీఐ, సీపీఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులంతా పాల్గొంటారన్నారు.