హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు దోపిడీని నిరసిస్తూ ఆలిండియా నేషనల్ రక్షాసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25న నిర్వహించే మహాధర్నాకు సీపీఎం మద్దతు ప్రకటిస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విడుదల చేశారు.
ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరానికి ముందే అడ్మిషన్లు, డొనేషన్ల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యా హక్కుచట్టం అమలులో ఉన్నా నిరుపయోగంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.