నేరేడుచర్ల, మార్చి 26: మతోన్మాద శక్తులను రెచ్చగొడుతూ.. కులాలు, మతాల మ ధ్య చిచ్చు పెడుతున్న బీజేపీకి దేశాన్ని పాలిం చే హక్కు లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యు డు విజ్జుకృష్ణన్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఎం చేపట్టిన జనచైతన్య యాత్ర ఆదివారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చేరుకున్నది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న విజ్జుకృష్ణన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో దేశ వ్యాప్తంగా 2014 నుంచి 2022 వరకు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు.
రైతుల సమస్యలను పరిష్కరించాలని ఏప్రిల్ 5న ముజ్దూర్ కిసా న్ సంఘ్ ఆధ్వర్యంలో 550 రైతు సంఘా లు, 5 లక్షల మంది రైతులతో ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర ్గసభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభు త్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ యాత్ర చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో జనచైతన్య యాత్ర ఇన్చార్జి పోతినేని సుదర్శన్, పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి పాల్గొన్నారు.